Friday, May 3, 2024

HYD: సకల జనులంతా సంతోషంగా ఉండాలి.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : స‌క‌ల జ‌నులంతా సంతోషంగా ఉండాల‌ని ఐవీఎఫ్‌-అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని బోరబండ, ఆర్కే సొసైటీలో శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ చక్ర మేరు ధ్వజస్తంభ మంత్ర ప్రతిష్టా సహిత మహా కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని, అమ్మవారిని దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కన్యకా పరమేశ్వరి మాతకు జరిగిన అభిషేకం యాగంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు, వేద మంత్రాలతో, కండువాలతో సన్మానించి ఆశీర్వదించడం జరిగింది. ఈసందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉన్న ఇబ్బందులు అన్ని తొలగి, వారు సుఖ, సంతోషాలతో జీవించాలని, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో.. ఐవీఎఫ్ హైద‌రాబాద్ జిల్లా అధ్య‌క్షుడు ఉటుకూరి శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement