ఆంధ్రప్రదేశ్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, దిగ్గజ జ్యుయలరీ సంస్థల్లో ఒకటైన కల్యాణ్ జ్యుయలర్స్, ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొత్తగా తీర్చిదిద్దిన షోరూమ్ను ప్రారంభించింది. ప్రముఖ నటి శ్రీలీల ఈ షోరూమ్ను ప్రారంభించారు. కల్యాణ్ జ్యుయలర్స్కి చెందిన విస్తృత శ్రేణి డిజైన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులకు అత్యుత్తమమైన, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించేలా సకల సదుపాయాలతో ఈ షోరూమ్ తీర్చిదిద్దబడింది. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి నటి శ్రీలీల మాట్లాడుతూ… కల్యాణ్ జ్యుయలర్స్ కొత్త షోరూమ్ భారీ ప్రారంభోత్సవానికి హాజరు కావడం తనకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు. విశ్వసనీయత, నిజాయితీ, కస్టమర్ల పట్ల నిబద్ధత కలిగిన బ్రాండ్కు ప్రాతినిధ్యం వహించగలగడం ఎంతో గర్వకారణమన్నారు. ఆకర్షణీయమైన ఆభరణాల కలెక్షన్తో ఇక్కడి ఆభరణాల ప్రేమికులను కల్యాణ్ జ్యుయలర్స్ నిస్సందేహంగా ఆకట్టుకోగలదని తెలిపారు.
కల్యాణ్ జ్యుయలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కల్యాణరామన్ మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్లో సరికొత్తగా తీర్చిదిద్దిన కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్ను ప్రారంభించడం ద్వారా తమ కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఆభరణాలను అందించే సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తేవడం, వారికి అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని కలిగించడమనేది తమ లక్ష్యమన్నారు. విశ్వసనీయత, పారదర్శకత అనే మూలసూత్రాలకు కట్టుబడి ఉంటూనే కస్టమర్లకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించేందుకు ఎప్పటికప్పుడు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకుంటూనే ఉంటున్నామన్నారు. నాణ్యత, సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి విస్తృతమైన, విశిష్టమైన ఆభరణాల డిజైన్లను అందించడం కొనసాగిస్తామని తెలిపారు. ఈ షోరూమ్లో పేరొందిన కల్యాణ్ జ్యుయలర్స్ హౌస్ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ముహూరత్ (వెడ్డింగ్ జ్యుయలరీ కలెక్షన్), ముద్ర (హ్యాండ్క్రాఫ్టెట్ యాంటిక్ జ్యుయలరీ), నిమహ్ (టెంపుల్ జ్యుయలరీ) అనోఖి (అన్కట్ డైమండ్స్) మొదలైనవి వీటిలో ఉన్నాయి.