Friday, April 26, 2024

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నటి పూజితరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్కులో గృహాలక్ష్మి సీరియల్‌ నటి పూజిత రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పూజితరెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ చుట్టు-పక్కల రోజురోజుకు గ్రీనరీ పెరుగుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా గృహాలక్ష్మి సీరియల్‌ నటీ-నటు-లు వెంకట్‌, కనకదుర్గ, అవినాష్‌లకు ఆమె ఛాలెంజ్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement