Friday, April 26, 2024

తెలంగాణాలో కొత్త‌గా 6361 క‌రోనా పాజిటివ్స్ – 51 డెత్స్…

హైద‌రాబాద్ – రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 77.435 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 6361 మందికి పాజిటివ్ నిర్ధార‌ణైంది.. . తాజా కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4, 69, 722కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో 8126 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3, 89, 491 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా… ఇక కరోనాతో మంగ‌ళ‌వారం నాడు 51 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్యను కలుపుకుంటే ఇప్పటి వరకు రాష్ర్టంలో 2527 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
జిల్లాల వారిగా న‌మోదైన కేసుల వివ‌రాలు..
ఆదిలాబాద్‌లో 82, భద్రాద్రి కొత్తగూడెం 98, జీహెచ్‌ఎంసీ 1225, జగిత్యాల 178, జనగామ 51, జయశంకర్‌ భూపాలపల్లి 75, జోగులాంబ గద్వాల 87, కామారెడ్డి 107, కరీంనగర్ 248, ఖమ్మం 188, కొమరంభీం ఆసీఫాబాద్ 57, మహబూబ్‌నగర్ 224, మహబూబాబాద్ 107, మంచిర్యాల 148, మెదక్ 78, మేడ్చల్‌ మల్కాజిగిరి 422, ములుగు 35, నాగర్‌కర్నూలు 190, నల్గొండ 453,నారాయణపేట 34. నిర్మల్ 35, నిజామాబాద్ 164, పెద్దపల్లి 100, రాజన్నసిరిసిల్ల 89, రంగారెడ్డి 423, సంగారెడ్డి 227, సిద్ధిపేట 244, సూర్యాపేట 239, వికారాబాద్ 148, వనపర్తి 110, వరంగల్‌ రూరల్ 99, వరంగల్‌ అర్భన్ 234, యాదాద్రి భువనగిరి 162.

Advertisement

తాజా వార్తలు

Advertisement