Monday, April 29, 2024

హైదరాబాద్ లో రేపు 34 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ ర‌ద్దు

హైద‌రాబాద్ న‌గ‌రంలో రేపు 34 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప‌లు ప‌నుల కార‌ణంగా ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. లింగంప‌ల్లి – హైద‌రాబాద్ మ‌ధ్య‌లో 9 స‌ర్వీసులు, హైద‌రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య 9 స‌ర్వీసులను ర‌ద్దు చేశారు. సికింద్రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య న‌డిచే 47150 రైలు, లింగంప‌ల్లి – సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే 47192 రైలును కూడా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు. ఫ‌ల‌క్‌నూమా – లింగంప‌ల్లి మ‌ధ్య ఏడు స‌ర్వీసులు, లింగంప‌ల్లి – ఫ‌ల‌క్‌నూమా మ‌ధ్య ఏడు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement