Thursday, May 16, 2024

తెలంగాణలో కొత్త‌గా 3037 పాజిటివ్స్ – 8 డెత్స్

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో కొత్త‌గా 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో మ‌రో ఎనిమిది మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1788 చేరింది.. నేడు 897 మంది కోలుకున్నారు. .మొత్తం 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్ర‌స్తుతం 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 446, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 314, నిజామాబాద్‌లో 279 చొప్పున ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement