Friday, May 10, 2024

సికింద్రాబాద్ లో పటిష్టంగా బిజెపి

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని, పార్టీ పిలుపినిచ్చిన ప్రతి కార్యక్రమాని విజయవంతం చేస్తున్నామని సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో లష్కర్‌లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. గతంలో చిన్నచిన్న పోరపాట్ల వల్ల బీజేపీ ఓటమి పాలైందని, ఆ పోరపాట్లు ఇకముందు జరుగకుండా చూస్తున్నామని చెప్పారు. ఇక సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని, ఆపార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న పద్మారావుగౌడ్‌ ప్రజలకు ఏమి చేయలేకపోతున్నారని, తన ఆస్తులను మాత్రం పేంచుకుంటు వస్తున్నారన్నారు. పదివేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కట్టిస్తానని చెప్పిన పద్మారావు ఇంతవరకు ఎన్ని ఇండ్లు కట్టించారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి రెండవ సారి ఎన్నికలలో గెలిచిన టీఆర్‌ఎస్‌ ఈసారి మాత్రం ఓటమి తప్పదన్నారు. పద్మారావు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement