Sunday, April 28, 2024

Hyderabad : డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ పోలీసులు సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సప్లయర్ టోనీ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు. టోనీ పట్టుబడడంతో కొందరు వ్యాపారవేత్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో సంబంధం ఉండి.. పరారీలో ఉన్న 15 మంది వ్యాపారవేత్తల వివరాలను పోలీసులు సేకరించారు.
ఇప్పటికే A1 టోనీ, A2 ఇబ్రాన్ బాబు షేక్ , A3 నూర్ అహమ్మద్ ఖాన్ A10 నిరంజన్ కుమార్ జైన్, A11 శేషావత్ జైన్, A12 యజ్ఞానంద్ అగర్వాల్ , A13 దండు సూర్య సుమంత్ రెడ్డిలు సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న 15 మందిలో నలుగురు బడా బిజినెస్ మాన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్ద పల్లి, అశోక్ జైన్ లుగా గుర్తించారు. ఈమేరకు నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement