Wednesday, March 27, 2024

రేపటి టీచర్ల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు

ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా టీచర్ల ఉద్యమాన్ని చేపట్టనున్నారు. రేపు టీచర్ల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దుతు తెలిపింది. జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు (జనవరి 29) రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్వర్యంలో 317 జీఓ రద్దు కోరుతూ జరిగే ధర్నా కు  కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని రేవంత్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి కార్యకర్త పాల్గొని ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి మద్దతు పలకాలని స్పష్టం చేశారు. అదే విధంగా సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన ప్రస్తుతం తమ స్థానికతకే ముప్పు ఏర్పడిన 317 జీఓ రద్దు కై నిరంతరం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుందని చెప్పారు.

ఉపాధ్యాయ సంఘాలు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు ఎవరు ఆధైర్య పడొద్దని, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేయడానికి ముందు ఉండటమే కాకుండా, ఉద్యోగులకు కూడా అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement