Monday, April 29, 2024

Hyderabad జూపార్క్ లో విషాదం – ఏనుగు దాడిలో కేర్ టేక‌ర్ దుర్మరణం

హైదరాబాద్ నెహ్రు జూ పార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో కేర్ టేకర్ షాబాజ్ మృతి చెందారు. ఫుడ్ పెడుతున్న సమయంలో షాబాజ్‌ను వెనుక నుంచి ఏనుగు బలంగా దాడి చేసింది ఈ దాడిలో షాబాజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను జూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికేే షాబాజ్ మృతి చెందారు.. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్ట్ మార్టమ్ అనంతరం ఆయన బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement