Sunday, April 28, 2024

TS: కామారెడ్డిలో కేసీఆర్ మెజార్టీ దేశ చరిత్రలో నిలవాలి… కేటీఆర్

కామారెడ్డి, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : రానున్న ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు మెజార్టీతో గెలిచి దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం చూపు అంతా కామారెడ్డి పైనే ఉందన్నారు.

ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖామంత్రి ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ముజీబ్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement