Sunday, April 28, 2024

బ్రేకింగ్: రెండో రౌండ్ లోనూ ఈటలదే పైచేయి

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తి అయ్యాయి. రెండు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ కు 4,444, కాంగ్రెస్‌ కు 119 ఓట్లు వచ్చాయి. అనంతరం నిర్వహించిన రెండవ రౌండ్‌లో కూడా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. రెండోవ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4,947, బీజేపీకి 4,769 ఓట్ల వచ్చాయి. రెండవ రౌండ్ లో వచ్చిన ఓట్లతో ప్రస్తుతం ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, మొత్తం 22 రౌండ్‌లకు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement