Sunday, April 28, 2024

TS | మోకిల ప్లాట్లకు భారీ డిమాండ్.. ప్రీ బిడ్ మీటింగ్ కు అనూహ్య స్పందన

శంకర్‌పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ఆదరణ దృష్ట్యా హెచ్ఎండిఏ మోకిల లే అవుట్ ప్లాట్లకు భారీగా డిమాండ్ నెలకొంది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందిస్తోంది. మోకిల ప్లాట్లకు డిమాండ్ నేపథ్యంలో హెచ్ఎండిఏ రెండో దశలో 300 ప్లాట్లను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నది. దీనికి సంబంధించి గురువారం మోకిల లేఅవుట్ ప్రాంతంలో హెచ్ఎండిఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అనూహ్యమైనరీతిలో స్పందన వచ్చింది.

హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సిఐఓ) ఎస్.కె.మీరా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సిపిఓ) రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) సాయిరాం,శంకర్ పల్లి మండలం తహశీల్దార్ సురేంద్రలతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రీబిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే పద్ధతులను వివరించారు. హెచ్ఎండిఎస్ సెక్రెటరీ చంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రాముఖ్యతను వివరించారు. ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement