Saturday, April 27, 2024

ADB : శభాష్ షాకీర్… నిజాయతీని చాటుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్

బోథ్, డిసెంబర్ 10(ప్రభ న్యూస్)
ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ షాకీర్ విధీ నిర్వహహణలో తన నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే డిసెంబర్ తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నిర్మల్ నుండి హైదరాబాద్ వెళ్లిన బస్సులో అభినవ్ రెడ్డి అనే ప్రయాణికుడు జెబీస్‌లో దిగి తన బ్యాగును మర్చిపోయాడు.

అందులో 50వేల రూపాయల నగదు ఐఫోన్ ఉంది. అది గమనించిన ఆ బస్సు డ్రైవర్ షాకీర్ సెల్ఫోన్ ఆధారంగా ఆ వ్యక్తికి సమాచారం అందించి హైదరాబాద్ బస్ స్టేషన్ మేనేజర్ సమక్షంలో ఆ ప్రయాణికుడికి తను మర్చిపోయిన బ్యాగును అందించారు. ఈ సందర్భంగా డ్రైవర్ షాకీర్ నిజాయితీకి మెచ్చి మేనేజర్ తోటి ఉద్యోగులు, లబ్ధిదారుడు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement