Sunday, April 28, 2024

TS : ఆక్ర‌మ‌ణ‌ల‌పై కొర‌డా…

అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై అధికారుల కొర‌డా ఝులిపించారు. కూకట్‌ప‌ల్లిలో ఫూట్ పాత్ రోడ్లను ఆక్రమించి వెలిసిన అక్రమ నిర్మాణాలను తెల్ల‌వారు జాము నుంచి అధికారులు కూల్చివేస్తున్నారు. జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా అక్ర‌మణ‌ల‌కు గురైన నేప‌థ్యంలో జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య టాఫిక్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు.

ముఖ్యంగా కెపిహెబి మెయిన్ రోడ్డు బస్ స్టాప్ రహదారిపై రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో ఇటీవల అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో జోనల్ కమిషనర్ స్పందించి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ట్రాఫిక్ అధికారుల సహకారంతో తొలగింపు చర్యలు చేపట్టారు. ఫూట్ పాత్ రోడ్లను ఆక్రమించి వెలిసిన అక్రమ నిర్మాణాలను దుకాణాలను,పార్కింగ్ స్థలాన్ని జెసిబి సహాయంతో తొలగిస్తున్నారు ..మూసాపేట్ వై జంక్షన్ నుంచి బాలాజీ నగర్ వరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి రాజారాణి రుచులు వరకు ఈరోజు తొలగింపు కార్యక్రమాన్ని పూర్తిచేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement