Monday, April 29, 2024

వైయస్ షర్మిల వ్యాఖ్య‌ల‌పై హిజ్రాల ఫైర్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పై హిజ్రాలు ఫైర్ అయ్యారు. ఇటీవల మహబూబాబాద్ లో నిర్వహించిన పాదయాత్రలో ష‌ర్మిల‌ హిజ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ నగరంలోని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వైయస్ షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన హిజ్రాలు.. వరంగల్ హెడ్పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో వైయస్ షర్మిల ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆపై హిజ్రాలు వైయస్ షర్మిల ఫ్లెక్సీ దగ్ధం చేశారు. వైయస్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వైయస్ షర్మిలకు హిజ్రాలు హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement