Thursday, April 25, 2024

Kavitha: ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజుల పొడిగింపు

నేటితో ముగిసిన ఈడీ కస్టడీ
మరో మూడు రోజుల కస్టడీ కోరనున్న ఈడీ
కొనసాగింపునకు కవిత లాయర్ల అభ్యంతరం

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.

క‌స్ట‌డీ వ‌ద్దు.. ఆరోగ్యం బాగాలేదు..

కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాల‌ని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉండడంతో.. ఈ కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్‌ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement