Thursday, May 2, 2024

Telangana: గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్క‌లు నాటిన టీఎస్‌ రెడ్కో చైర్మ‌న్ స‌తీష్‌రెడ్డి

తెలంగాణ స్టేట్ రెనేవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (TSREDCO) చైర్మ‌న్ వై స‌తీష్‌రెడ్డి ఇవ్వాల (గురువారం) గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటారు. రాజ్య‌సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ ప్రోగ్రామ్‌కి రాజ‌కీయ‌, సినీ రంగాల నుంచే కాకుండా విద్యాధికులు, మేధావులతో పాటు ప‌లు వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇక‌.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లోని ఆఫీసు ఆవరణలో స‌తీష్‌రెడ్డి ఇవ్వాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌న పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉంద‌న్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటి సంరక్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement