Thursday, April 25, 2024

AP: సీఎం జ‌గ‌న్‌తో క్రీడాకారులు పీవీ సింధు, ర‌జ‌ని భేటీ.. ప‌సిడి ప‌త‌కం తేవ‌డంపై ప్ర‌శంస‌లు

ఈ మ‌ధ్య జ‌రిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో స‌త్తా చాటిన స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు, భార‌త హాకీ జ‌ట్టు మెంబ‌ర్ ఇ. ర‌జ‌ని ఇవ్వ‌వాల (గురువారం) ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు స‌త్తా చాట‌డంపై సీఎం జ‌గ‌న్ ప్ర‌శంసించారు. ఇక‌.. పీవీ సింధు ప‌సిడి ప‌త‌కం తేవ‌డాన్ని ఆయ‌న కొనియాడారు. అదే స‌మ‌యంలో మునుప‌టి కంటే మెరుగ్గా రాణించిన భార‌త హాకీ జ‌ట్టులో ర‌జ‌నీ కీల‌క భూమిక పోషించింది.

కామ‌న్వెల్త్ గేమ్స్ ముగిసిన త‌ర్వాత ఈ మ‌ధ్య‌నే రాష్ట్రానికి చేరుకున్న సింధు, ర‌జ‌ని ఏపీ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటికి వెళ్లారు. రోజా కుటుంబంతో క‌లిసి వారిద్ద‌రూ మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు. తాజాగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వ‌చ్చిన క్రీడాకారులు సీఎం జ‌గ‌న్‌తోనే భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement