Sunday, April 28, 2024

Green India Challenge – కెబిఆర్ పార్క్‌లో మొక్క‌లు నాటిన ఎంపి జె సంతోష్ కుమార్

హైదరాబాద్‌ : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కెబిఆర్ పార్క్ లో నిర్వ‌హించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని బంజారా హిల్స్ పార్క్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు కరుణాకర్, రాఘవ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement