Thursday, May 2, 2024

గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తాండలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమంలో గవర్నర్ దంపతులకు జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి టీకా వేశారు. స్థానిక గిరిజనులతో కలిసి వాక్సిన్ వేయించుకుని, వారిలో ఉత్సహం నింపారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ గిరిజ‌న‌ ప్ర‌జ‌లంటే త‌న‌కు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు. గిరిజ‌న గ్రామాల్లో వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా జ‌రుగుతోంద‌ని తెలిసిందని, మీకంద‌రికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు వ‌చ్చానని తెలిపారు. అంద‌రూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్‌ను జ‌యించొచ్చు అని గవర్నర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement