Sunday, April 28, 2024

ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ షాక్ – రెండు బిల్లులు వెన‌క్కి… మ‌రో బిల్లు తిర‌స్క‌ర‌ణ‌….

హైద‌రాబాద్ – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కెసిఆర్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చారు.. డిఎంఇ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచుతూ పంపిన బిల్లును గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై తిర‌స్క‌రించారు. మ‌రో రెండు బిల్లులను ప్ర‌భుత్వానికి తిప్పి పంపారు.. మ‌రో బిల్లుపై ప్ర‌భుత్వ వివ‌ర‌ణ కోరారు.. కాగా మొత్తం 10 బిల్లుల్లో 3 బిల్లులను గవర్నర్ గ‌తంలోనే ఆమోదించగా మరో 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మిగిలిన 5 బిల్లుల్లో 3 బిల్లులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి పంపించగా మరో బిల్లును సోమవారం తిరస్కరించారు. మిగిలిన ఒక బిల్లు తనకు అందలేదని గవర్నర్ తెలిపారు.. నేడు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై అనూహ్యంగా బిల్లుల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు.. త‌న వ‌ద్ద ఎటువంటి బిల్లులు పెండింగ్ లో లేవ‌ని సుప్రీం కోర్టు తెలిపే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement