Sunday, April 28, 2024

Manikondaలో ఘనంగా గోదా రంగనాయ స్వామి కళ్యాణం

మణికొండ – ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా చివరి రోజుఆయిన ఆదివారం స్థానిక పంచవటి సాయిలక్ష్మి కాలనీ లోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో గోదారంగనాయక స్వామి వార్ల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.. ఆలయ కమిటీ వేద పండితుల తో గత నెలరోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు అయిన
ఆదివారం నిర్వహించిన గోదాదేవి కళ్యాణం లో సుమారు యాభై జంటలు స్వామి వారి కళ్యాణ లో పాల్గొన్నారు.. విశేష సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌రై క‌ల్యాణాన్ని వీక్షించి స్వామి వారి ప్రసాదాలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు అన్నదాన ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement