Sunday, April 28, 2024

TS: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్ గ‌ద్వాల్ విజయలక్ష్మి

త్వ‌ర‌లోనే త‌న తండ్రి కూడా చేర‌తార‌న్న విజ‌య‌ల‌క్ష్మీ
మాజీ ఎమ్మెల్సీ పురాణం సైతం హ‌స్తం నీడ‌లోకి
క్యూలో ఉన్న సీనియ‌ర్ లీడ‌ర్‌ క‌డియం శ్రీహ‌రి, కావ్య‌
రేవంత్‌ని క‌లిసిన టీడీపీ నాయ‌కురాలు సుహాసిని
కాంగ్రెస్‌లో చేర‌వ‌చ్చంటూ ఊహ‌గానాలు

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి శ‌నివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీఎంరేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, త్వ‌ర‌లోనే త‌న తండ్రి కె కెశ‌వ‌రావు కూడా కాంగ్రెస్ లో చేర‌తార‌ని విజ‌య‌ల‌క్ష్మీ తెలిపారు..

అలాగే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాస్ మున్షీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరడంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారు. పురాణం సతీష్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం స్తంభించిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఇంతకాలం బానిస సంకెళ్లలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రిలోనూ 400 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని కొనియాడారు. ఆరు హామీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లని చేశారని విమర్శించారు.

రేవంత్ తో నంద‌మూరి సుహాసిని భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు సుహాసిని కలిశారు. శ‌నివారం ఉదయం రేవంత్ నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్‌తో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్‌ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపట్లో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య రేవంత్ ను కలిసే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement