Saturday, May 4, 2024

గన్నేరువరం పోలీసుల ఔదార్యం.. గర్భిణీ స్త్రీని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలింపు

గన్నేరువరం, జులై 27 (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వేముల సుప్రియ అను గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు రావడంతో వారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ చొక్కారావుపల్లె మీదుగా గన్నేరువరం చెరువు మత్తడి వద్దకు వచ్చి దాటే పరిస్థితి లేక వెనుదిరిగి పోగా.. బాధితులు పోలీసుల సహాయం కోరారు.

దీంతో ఎస్సై చందా నరసింహారావు తక్షణమే స్పందించి పోలీస్ వాహనంలో ఆమెను ఎక్కించుకొని సిద్దిపేట జిల్లా తోటపల్లి మీదుగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన పోలీస్ సిబ్బందికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement