Sunday, April 28, 2024

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం … ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

మక్తల్, జులై 27(ప్రభన్యూస్) నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాసులుగా గుర్తించారు.విహారయాత్ర కు వెళ్ళిన ముగ్గురు మిత్రులు తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలంలోని గుడిగండ్ల సమీపంలో కర్ణాటక వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీని ఢీకొట్టింది. లారీని ఢీ కొట్టిన కారు లారీకి ఇరుక్కుపోగా లారీ దాదాపు అరకిలోమీటర్ వరకు కారును లాక్కొని వెళ్ళింది. రోడ్డుపై వెళ్తున్న ఇతరులు గమనించి లారీని ఓవర్టేక్ చేసి విషయాన్ని లారీ డ్రైవర్ కు చెప్పగా లారీని రోడ్డు పక్కకు నిలిపి డ్రయివర్ పరారయ్యారు.

కారు ఢీకొని లారీకి కారు ఇరుక్కుపోయిన విషయాన్ని డ్రైవర్ గుర్తించలేదని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో భాష (50) శుకూర్(50) మృతిచెందగా వెంకట్రావు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ ప్రశాంత్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం నుండి బయటపడ్డాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థానానికి వెళ్లి మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. మృతుల కుటుంబాల నుండి ఫిర్యాదు అందవలసి ఉందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement