Sunday, April 28, 2024

TS: బావిలో ప‌డి గీత కార్మికుడు మృతి..

ఖమ్మం: తాడిచెట్టుపై నుండి వ్య‌వ‌సాయ బావిలో ప‌డి గీత కార్మికుడు మృతిచెందిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లా తిరుమలాయపాలెం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన, మల్లారపు వెంకన్న(55) కల్లు గీత కార్మికుడు రోజులాగే సమీప గ్రామమైన చంద్రుతండాలో తాడిచెట్టు ఎక్కుతున్నాడు. అయితే ప్రమాదవశత్తు చెట్టుపై నుంచి, జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.

ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో వెంకన్న మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement