Monday, April 29, 2024

Breaking : గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురంలో గంజాయి చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం ఎస్‌వోటీ పోలీసులకు తెలిసింది.


ఈ మేరకు రామచంద్రాపురానికి వెళ్లి నిందితులను పట్టుకునేందుకు ముందుగా రెక్కీ నిర్వహించారు. అనంతరం చాక్లెట్లను పలువురికి విక్రయిస్తుండగా ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement