Thursday, May 2, 2024

నిజామాబాద్ లో దారుణం.. యువతిని మద్యం తాగించి..

ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి.  చిన్నారులు, బాలికలు, మహిళలు అనే తేడా లేకుండా వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, నిజామాబాద్​లో యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: మూసీ ప్రాజెక్ట్‎ 8 గేట్లు ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement