Sunday, April 28, 2024

Statue – ట్యాంక్ బండ్ పై గ‌ద్ద‌ర్ విగ్ర‌హం… స్థ‌లం కేటాయించిన ప్ర‌భుత్వం ..

హైద‌రాబాద్ – విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement