Thursday, May 2, 2024

ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత..

హైదరాబాద్ – ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన హస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.. కొద్దిసేపటి క్రితం ఆయన అక్కడే మరణించారు.. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో గద్దర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌.. పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు.

1949 తూఫ్రాన్ లో జన్మించిన గద్దర్ గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు…తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు అందుకున్నారు. అయితే, నంది అవార్డును తిరస్కరించారు.

గద్దర్ మరణంలో ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు.. రాజకీయ, సినీ, ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement