Tuesday, May 21, 2024

బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భ‌కి ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ -మోడీ ప్ర‌సంగాన్ని విన‌డానికే వ‌చ్చా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగం విన‌డానికే తాను బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భ‌కి వ‌చ్చిన‌ట్లు తెలిపారు ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ స‌భ జ‌రుగుతోంది. చాలా కాలం వామపక్షాల తరఫున నిలిచిన గద్దర్.. వాటికి విరుద్ధంగా ఉండే బీజేపీ సభా ప్రాంగణానికి రావడం గమనార్హం. తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికే సభకు వచ్చానని.. ఆయన ఏం సందేశం ఇస్తారన్నది విన్నాక తాను మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. ఇటీవల కొంతకాలంగా రాజకీయ నేతలను కలుస్తున్న గద్దర్.. గతంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభకూ హాజరయ్యారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నేతలు.. ప్రత్యేక బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్ సభా ప్రాంగణానికి వెళ్తున్నారు.

ఈ మేరకు హెచ్ఐసీసీ వద్ద ప్రత్యేక బస్సులను బీజేపీ నేతలు సిద్ధం చేశారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సులను పరేడ్ గ్రౌండ్స్ కు తీసుకెళ్లనున్నారు. పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని మోదీ, ఇతర వీవీఐపీలు వస్తుండటంతో వేదిక, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్పీజీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లోపల 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అందరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement