Monday, April 29, 2024

జగనన్నకి మద్దతు ఇవ్వండి- ఎమ్మెల్యే..భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి .. ప్రభ న్యూస్.. జగనన్నకు మద్దతు ఇవ్వండని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా 47 వ డివిజన్ సత్యనారాయణపురం. నందు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రతి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు..2024 కూడాజగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని ప్రజలు ఆశీర్వదించడం జరుగుతున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ శిరీష . డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి. 47వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement