Sunday, April 28, 2024

TS : ఇక నేరుగా… జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు మాజీ సీఎం…

మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం బాధిత రైతులతో సమావేశమవుతారు.

జనగామ‌, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జ‌న‌గామ‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement