కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని ఫ్రస్ట్రేషన్లో అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్ధకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.
- Advertisement -
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విన్నింగ్ టీమ్ పనిచేస్తున్నామన్నారు. పదేళ్లలో సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు, పలువురు సెలబ్రెటీల ఫోన్ల ట్యాపింగ్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.