Monday, May 6, 2024

AP: ప్ర‌జ‌లు చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితిలో లేరు..మంత్రి పెద్దిరెడ్డి

ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ వచ్చినా చంద్రబాబు తనపై విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబుకు ప్రజలెవ్వరూ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ నామినేషన్ దాఖలు చేసే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.

- Advertisement -

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ 35 ఏళ్లుగా మనల్ని మోసం చేస్తూ.. వస్తున్న చంద్రబాబు ను నమ్మితే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించ‌డ‌న్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ ర్యాలీ చూశాక భరత్ కచ్చితంగా విజయం సాధిస్తారని అర్థమవుతుందని తెలిపారు. ఎంపీగా రెడ్డప్పను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement