Wednesday, May 1, 2024

TS: స‌ర‌స్వ‌తి అమ్మవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ ర‌మ‌ణ‌

బాసర, ఫిబ్రవరి 26 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని సోమవారం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అమ్మవారి ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో వారి మనుమడు విరాట్ కి ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్, పూజారి వేద మంత్రోచ్ఛారణల మధ్య అక్షరాభ్యాసం చేయించారు. వీరికి ఆలయం తరఫున ఆలయ ఈవో విజయరామారావు పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మ వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట బైంసా ఏ ఎస్ పి కాంతిలాల్ పాటిల్, తాసిల్దార్ పవనచంద్ర, ఆయా శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement