Sunday, April 28, 2024

For Lok Sabha – రేవంత్ ఛైర్మన్ గా ఎన్నికల కమిటీ..

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలు కమిటీనీ ప్రకటించింది. 25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.

డిప్యూటీ సీఎం భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుక చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీత రావులకు ఈ కమిటీలో చోటు కల్పించారు

వీరితో పాటు కమిటీలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా కమిటీలో చోటు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement