Monday, April 29, 2024

Food Poisoning – క‌లుషిత ఆహారం తిన్న 70 మందికి అస్వ‌స్థ‌త

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపల్లిలో కలుషిత ఆహారం తిని దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన ముండే బలవంత్‌.. పితృ మాసం సందర్భంగా స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు తిన్న కొందరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఉదయం సైతం మరికొందరు ఇలాగే ఇబ్బంది పడటంతో 108కు సమాచారం అందించారు. 20 మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు, మరికొందరిని మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి ఐదు అంబులెన్స్‌ల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వైద్యుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ సేవలందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement