Sunday, April 28, 2024

Mulugu | కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

ములుగు ప్రతినిధి (ప్రభ న్యూస్): కారులో మంటలు చెలరేగడంతో చాకచక్యంగా తప్పించుకున్న ఘటన ములుగు జిల్లా ములుగు మండలంలో ఇవ్వాల (సోమవారం) జ‌రిగింది. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని ఇంచర్ల గట్టమ్మ వద్ద ప్రజాపతి హోటల్ నడుపుతున్న ఆశాడపు దేవేందర్ పని నిమిత్తం ములుగు వ‌చ్చాడు.

అక్క‌డినుంచి పత్తి పల్లి రోడ్ మీదుగా ఏరియా హాస్పిటల్ దగ్గరికి చేరుకోగానే కారులో నుంచి మంటలు తెలెత్తాయి. దీంతో ఆయన కారులోంచి చాకచక్యంగా తప్పించుకొని బయటపడ్డారు. ఈ క్రమంలో ఆయన కుడి కాలు కాలింది. వెంటనే అతడిని హాస్పిట‌ల్‌కు తరలించి చికిత్స అందించారు. .విషయం తెలుసుకున్న ములుగు సీఐ మేకల రంజిత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement