Friday, May 3, 2024

Re entry – లోక్ స‌భ‌లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ – కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు పార్లమెంట్‌ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్‌ సభ కు హాజరయ్యారు. గతంలో మోడీఇంటి పేరు పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రాహుల్‌ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. కోర్టు తీర్పుతో రాహుల్‌ పై వేసిన అనర్హతను లోక్ సభ సచివాలయం ఎత్తివేసింది. ఈ మేరకు లోక్‌ సభ సెక్రటేరియట్‌ సోమవారం ఉదయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాహుల్‌ తిరిగి పార్లమెంట్‌ లో అడుగుపెట్టారు.

ఈ ఉదయం పార్లమెంట్‌ కు వచ్చిన రాహుల్‌ ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్‌ భవనంలోకి త‌ల్లి సోనియా గాంధీతో క‌లసి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి సభ్యులు రాహుల్‌ కు ఘనంగా స్వాగతం పలికారు. ఎఐసిసి అధ్యక్షుడు మ‌ల్లీ ఖార్జున్ ఖ‌ర్గే స‌హ‌చ‌ర ఎంపిల‌కు స్వీట్స్ పంచిపెట్టారు.. కాగా, ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్‌ తన ట్విట్టర్‌ బయోలో మార్పులు చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడితన తర్వాత రాహుల్‌.. ట్విట్టర్‌ బయోలో తనను తాను డిస్‌ క్వాలిఫైడ్‌ ఎంపీగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఇప్పుడు మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ గా మార్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement