Saturday, May 4, 2024

Siddipet: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, 8మందికి తీవ్రగాయాలు

సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి క్వాలిస్ ఢీకొన్న ప్రమాద ఘటనా స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.

క్వాలిస్ లో మొత్తం 11మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నితిన్, గ్రీష్మ, నమ్రత ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్ లోని తిమ్మాపూర్ లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజనిరంగ్ కళాశాల విద్యార్థులు, సిద్దిపేట ప్రాంత వాసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement