Thursday, May 2, 2024

TS: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

చింతపల్లి, సెప్టెంబర్ 20 (ప్రభ న్యూస్) : చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పివిఆర్ ఫామ్ హౌస్ సమీపంలో మూల మలుపు వద్ద కారు, బైకు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలై నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… చింతపల్లి నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న పీఏ పల్లి మండలం అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ తన భార్య, కుమారుడితో కలిసి కొండమల్లేపల్లి వైపు వెళ్తుంటే మల్లేపల్లి వైపు నుండి చింతపల్లి వైపు వెళ్తున్న కారు బైకును ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురులో ప్రసాదు(38) అతని కుమారుడు అవినాష్ (12) అక్కడికక్కడే మృతి చెందగా. ప్రసాద్ భార్య మద్దమడుగు రమణకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో డ్రైవర్ పట్నపు మణిపాల్(18) మృతి చెందగా, పులి పవన్, వారాల మణివర్ధన్, వనం మల్లికార్జున్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం చింతపల్లి పోలీసులు స్థానికుల సహాయంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement