Wednesday, May 1, 2024

బీఆర్ ఎస్ కి పంట‌ని విరాళ‌మిచ్చిన రైతులు-కేసీఆర్ ద‌య‌వ‌ల్లే మా బ‌తుకు బాగున్నాయ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామానికి చెందిన దళితబస్తీ వాసులు తాము పండించిన సోయా పంట మొత్తానికి వచ్చే రూ. 66,000లను బీఆర్ఎస్‎కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే దేశంలో మా లాంటి ఎన్నో కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ఆదుకుంటారని అన్నారు. నేడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తునందుకు అనందంగా విరాళమిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన 33 మంది దళిత కుటుంబాలకు 99 ఎకరాల భూమి దళితబంధు పథకం కింద ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే తమ బతుకులు బాగుపడ్డాయని, కూలీలుగా ఉన్న తమని రైతుగా మార్చిన కేసీఆర్‎కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన భూమిలో పండిన సోయా పంట నుంచి ఒక్కొక్కరు 50 కిలోల చొప్పున 16.50 క్వింటాల్ సోయా పంటను అమ్మగా వచ్చిన మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా అందించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‎ గాడ్గె మినాక్షికి వారు అందజేశారు. ఈ సందర్బంగా సోయా పంటలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటిసీ గాడ్గె సుభాష్, తిరుపతి, సంజీవ్, దళిత కుటుంబాలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement