Wednesday, May 15, 2024

కరెంట్ షాక్ తో రైతు మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం  వేలుబెల్లి గ్రామ పంచాయతీలోని చెరువు ముందు తండాలో విషాదం చోటుచేసుకుంది. దరావత్ లక్ పతి (48)పొలానికి వ్యవసాయ బావి నుంచి నీళ్లు పారించడానికి మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పంట పొలంలోనే విఘత జీవిగా పడి ఉన్న లక్పతిని చూసి కుటుంబ సభ్యులు, తండా వాసులు బోరున విలపించారు. మృతునికి భార్య గమ్లి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement