Thursday, May 2, 2024

పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య

కౌడిపల్లి, (ప్రభ న్యూస్): పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కౌడిపల్లి

పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో గురువారం రోజున చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే వెల్మకన్నె గ్రామానికి చెందిన కర్రోళ్ల వెంకట్ రాములు 46 వ్యవసాయం చేస్తుంటాడు వ్యవసాయం దిగుబడి రాకపోవడంతో ట్రాక్టర్ కిస్తీ ఎలా కట్టాలో అని తరచూ ఆలోచిస్తూ తీవ్ర మనోవేదనకు గురై వెంకట్ రాములు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్రిమిసంహారకమందు సేవించాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మృతి చెందాడు మృతుని భార్య కర్రోల శ్యామల ఫిర్యాదు మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement