Monday, April 29, 2024

కరోనాపై కలిసి పోరాడుదాం: మాజీ ఎంపీ కొండా

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన తండ్రి ట్రస్టు జేకేఎంఆర్ ప్రొగ్రెసివ్ నుంచి కరోనా సేవల కోసం ట్రక్కును, ఆక్సిజన్ కాన్సంట్రేట్ మెషీన్ ను అందించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మద్దతు ఇస్తారని ఈ సందర్బంగా కొండా అన్నారు. జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో 10 ఫిలిప్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వికారాబాద్‌కు తరలించారు.  జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ లో పది పడకలను సిద్ధం చేశామని, చేవెళ్లలో మరో 15 ఆక్సిజన్ పడకలను తెరవడానికి ప్రయత్నిన్నామని వెల్లడించారు. కరోనా సమయంలో పార్టీలన పక్కన పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మద్దతు పలుతుతారని మాజీ ఎంపీ కొండా స్పష్టం చేశారు.

ఇదీ కూడా చదవండి: పుట్ట మధును ఇంటికి పంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement