Sunday, May 5, 2024

TS: మాజీ మంత్రి నర్సారెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా ఆయన ప్రజలకు సేవలందించారని కొనియాడారు. ఎనిమిది దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడు నర్సారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం వ‌ద్ద‌ నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కే శ్రీహరి రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రులు వివిధ రాజకీయ పార్టీల నేతలు నర్సారెడ్డికి నివాళులర్పించి సంతాపం వెలిబుచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement