Sunday, April 28, 2024

చీమలపాడు మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చీమలపాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్‌ పేలడంతో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈసంద‌ర్భంగా బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. మరో వైపు ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement