Monday, April 29, 2024

రేపు మహా ప్రస్థానంలో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు..

అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ మేరకు కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement